

స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కథ ఫైనల్ స్టేజ్లో ఉందని తెలుస్తోంది. మే నెలలో కథ పూర్తవుతుందని, జూన్ చివరికి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాకు ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి పని చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకుడిగా ఉండగా, జీ స్టూడియోస్ పెట్టుబడి పెట్టి నాన్-థియేట్రికల్ హక్కులు పొందనుందని తెలుస్తోంది. ప్రధాన నిర్మాణ బాధ్యత మాత్రం షైన్ స్క్రీన్స్ సంస్థదే ఉండనుంది.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా, వారిలో ఒకరుగా కీర్తి సురేష్ను ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ను త్వరలోనే ఎంపిక చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించనున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.








.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!