
న్యూస్

ట్రంప్ విజ్ఞప్తి మేరకు, ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన గ్యాస్ సంబంధిత ప్రాంతాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పరిస్థితి మరింత తీవ్రమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇరాన్కు ప్రస్తుతం బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే సామర్థ్యం లేదని నెతన్యాహు పేర్కొన్నారు. అవసరమైతే ఇరాన్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే హర్మూజ్ సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!