
టెక్నాలజీ

నగరంలోని బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రగతినగర్ నుంచి బాచుపల్లి వెళ్లే మార్గంలో మై స్పేస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న సుమారు ఆరు ఫర్నిచర్ దుకాణాలకు మంటలు అంటుకోవడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో దుకాణాల్లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తీవ్ర ప్రయత్నాల తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!