

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి భారీ వరాలు ప్రకటించింది. రహదారుల మెరుగుదల, తాగునీటి సరఫరా, రిజర్వాయర్ నిర్మాణం, జంతు సంరక్షణ కేంద్రం వంటి కీలక ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.4 వేల కోట్లకుపైగా నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు.
రాజధాని పరిధిలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) రెండో దశకు రూ.3,145 కోట్లతో గ్రీన్ సిగ్నల్ లభించింది. 1,142 కిలోమీటర్ల ప్రధాన రహదారులను ఐదేళ్లలో మెరుగుపరచనున్నారు. పాడైన రోడ్లను తొలగించి కొత్త బీటీ, సీసీ రోడ్లు వేయనున్నారు.
తాగునీటి రంగంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంజీరా ఫేజ్-1, ఫేజ్-2 పాత పైపులైన్ల స్థానంలో రూ.772 కోట్లతో కొత్త పైపులైన్ వేయనున్నారు. అలాగే ఉస్మాన్సాగర్ నుంచి ఆసిఫ్నగర్ వరకు ఉన్న పాత కాండ్యూట్ స్థానంలో రూ.280 కోట్లతో కొత్త పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. కోకాపేట నియోపొలిస్ వద్ద భారీ రిజర్వాయర్ నిర్మాణానికి రెండెకరాల భూమి కేటాయించారు.
హెచ్ఎండీఏ పరిధిలోకి నాలుగు గ్రామాలను చేర్చాలని నిర్ణయించారు. అలాగే గోపన్పల్లిలో వీధి కుక్కలు, ఇతర జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీ, రాంకీ ఫౌండేషన్, ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!