
సినిమాలు

వివేకా హత్య కేసుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీత పోరాటంలో న్యాయం ఉందని, తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు ఆమెకు ఉందని తెలిపారు. సునీత నిరంతర పోరాటం వల్లే ఈ కేసు ఇంకా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే హత్యా రాజకీయాల గురించి నేటి తరానికి కూడా అవగాహన వస్తోందని వ్యాఖ్యానించారు.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా సీఎం చంద్రబాబు స్పందించారు. టీడీపీ ప్రకటించిన 33 శాతం మహిళా రిజర్వేషన్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. సీట్ల సంఖ్యను 50 శాతం పెంచితే న్యాయం జరుగుతుందని, ఆ పెరిగిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!