
సినిమాలు

తమిళనాడులోని తిరుచెందూరు మురుగన్ ఆలయంలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అర్చకులు వీఐపీ దర్శనం పేరుతో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మంత్రి రమేష్ స్వయంగా మాస్క్ ధరించి సామాన్య భక్తుడిగా ఆలయానికి వెళ్లి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
దర్శనం కోసం రూ. 4000 వసూలు చేసినట్లు గుర్తించిన మంత్రి, ఆ మొత్తాన్ని గూగుల్ పే ద్వారా చెల్లించారు. అనంతరం తన గుర్తింపు బయటపెట్టి షాక్ ఇచ్చారు. ఈ ఘటనలో ఒక అర్చకుడు, ఇద్దరు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేశారు. మంత్రి చర్యలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!