

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణలో కీలకంగా పనిచేస్తున్న 50 మంది సైబర్ వారియర్స్ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హైదరాబాద్లో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సైబర్ వారియర్గా పనిచేస్తున్న లిఖిత వర్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, బాధితులకు తక్షణ సహాయం అందించడంలో ఆమె చేసిన సేవలను అధికారులు ప్రశంసించారు.
డీజీపీ బి. శివధర్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో TGCSB డైరెక్టర్ శిఖా గోయల్తో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాల దర్యాప్తు, ఫిర్యాదుల పరిష్కారం, బాధితులకు న్యాయం చేకూర్చడంలో నిబద్ధతతో పనిచేసిన అధికారులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ జాబితాలో లిఖిత వర్మ తన సేవలతో ప్రత్యేకంగా నిలిచారు.
సైబర్ వారియర్గా లిఖిత వర్మ NCRP పిటిషన్ల పరిష్కారం, సైబర్ మోసాల బాధితులకు రీఫండ్ ఆర్డర్లు వచ్చేలా సహకరించడం, ఫిర్యాదుల స్థితిని పర్యవేక్షించడం వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. అలాగే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. బాధితులతో సానుభూతిగా వ్యవహరించడం ఆమె ప్రత్యేకతగా పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!