
గాసిప్స్

కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు పూజించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం శ్రీవారి దర్శనానికి 12 నుంచి 18 గంటల వరకు సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. క్యూలైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. గురువారం రోజున 61,655 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 21,003 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!