

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. షేర్ పర్చేజ్ అగ్రిమెంట్తో పాటు త్రైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు మెట్రో సంస్థ ఎండీకి అనుమతి ఇచ్చింది. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన భారీ రుణం మంజూరుకు సంబంధించి ఆర్థిక సంస్థ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.
లావాదేవీ పూర్తి చేయడానికి అవసరమైన గ్యారంటీ పత్రాలు, అండర్టేకింగ్ లేఖలు, డెబిట్ మాండేట్లపై సంతకాలు చేసే అధికారం ఆర్థిక శాఖకు అప్పగించారు. ఈ ప్రక్రియలో భాగంగా సంబంధిత సంస్థలతో కలిసి ఎస్క్రో ఖాతాలు తెరవడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి చర్యలకు కూడా అనుమతి ఇచ్చారు. ప్రాజెక్టు ఈక్విటీ కోసం సుమారు రూ.1,385 కోట్లను అభివృద్ధి సంస్థ ద్వారా సమీకరించనున్నారు.
మెట్రో నిర్వహణ కోసం సిబ్బంది నియామకం, ఒప్పందాలపై సంతకాలు చేసే అధికారాలను కూడా మెట్రో సంస్థ ఎండీకి ఇచ్చారు. మొత్తం ఈక్విటీ పరిమితి నిర్దిష్ట స్థాయికి లోపే ఉండటంతో పోటీ కమిషన్ అనుమతి అవసరం లేకుండానే ఈ లావాదేవీని కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

.webp&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!