
గాసిప్స్

భారత విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుభవార్త ప్రకటించారు. భారతీయ విద్యార్థుల కోసం వీసా మరియు అడ్మిషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఫ్రాన్స్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు పెద్ద ఊరట లభించనుంది.
అదే సమయంలో, 2030 నాటికి ప్రతి సంవత్సరం ఫ్రాన్స్లో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్యను 30,000కు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మాక్రాన్ వెల్లడించారు. విద్యా రంగంలో భారత్–ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఫ్రాన్స్లో ఉన్నత విద్యకు ఆసక్తి చూపుతున్న భారత విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం కావడంతో పాటు, రెండు దేశాల మధ్య విద్యా మరియు సాంకేతిక సహకారాన్ని మరింత పెంచే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!