

ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఉగాది పండుగ నాటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి, నియామక ప్రక్రియను ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. శాఖలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించి, నియామకాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అధికారుల సమాచారం ప్రకారం, ఈసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉంది.
ప్రస్తుతం అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల పై సమగ్ర లెక్కలు సిద్ధం చేస్తున్నారు. శాశ్వత పోస్టులతో పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ఈ డేటాను ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఉన్న నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయిస్తున్నారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కలిపి సుమారు 30 శాతం వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని పోస్టుల్లో ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీటిని ఎలా భర్తీ చేయాలన్న అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది.
జాబ్ క్యాలెండర్ విడుదల అనంతరం ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ పూర్తికాగా, వచ్చే ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!