
జనరల్

ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజీత్ దీప్కే ఈ నెల 6న భారత్కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. దేశానికి వచ్చిన వెంటనే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొంటూనే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని వీడియో సందేశంలో తెలిపారు.
వివిధ పోటీ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుత ఆందోళన చేపడతానని చెప్పారు. ప్రజాస్వామ్యం, శాంతి, రాజ్యాంగ విలువలను విశ్వసించే ప్రజలు తనతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!