

తిరుపతి నగరంలో గురువారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకుల గ్యాంగ్ ఓ రచ్చ రేపింది. సింగాలగుంట ప్రాంతంలో దాదాపు ఐదు గంటలపాటు ఆరుగురు యువకులు, విద్యార్థులు వీరంగం సృష్టించారు. కనకభూషణ లేఅవుట్లో పార్క్ చేసిన ఆరు కార్ల అద్దాలు పగలగొట్టి, పక్కనే ఉన్న విద్యుత్ శాఖ సబ్స్టేషన్ కార్యాలయ కిటికీలు, తలుపులను ధ్వంసం చేశారు.
సబ్స్టేషన్ నైట్ షిఫ్ట్ ఆపరేటర్ రేవంత్కుమార్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చెన్నారెడ్డి కాలనీకి చెందిన ప్రవీణ్, విఘ్నేష్, వేణు (ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు)తో పాటు, అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు గుర్తించారు. మరో యువకుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కొంతకాలం క్రితం ప్రత్యర్థులతో వీరికి గొడవ జరిగిందని, ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మద్యం, గంజాయి మత్తులో వీరంగం సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు మందలించినా, గురువారం రాత్రి మళ్లీ రోడ్లపై బీరు బాటిళ్లతో దాడులు చేసి వాహనాలను ధ్వంసం చేశారు.
డయల్ 112 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ భక్తవత్సలం ఆదేశాలపై ఎస్ఐలు లోకేశ్బాబు, అజిత్ నేతృత్వంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికి శోధన కొనసాగుతోంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!