

హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే మరియు న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్ కొండ లక్ష్మారెడ్డి మృతి చెందారు. వయోసంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు.లక్ష్మారెడ్డి మాజీ ఉపముఖ్యమంత్రి కొండ వెంకట రంగారెడ్డి మనవడు. 1980లో పత్రికారంగంపై ఆసక్తితో NSS న్యూస్ ఏజెన్సీని స్థాపించారు.
ఆయన జూబ్లీహిల్స్ జర్నలిస్టుల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) లో ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ చైర్మన్ హోదాల్లో కూడా ఉన్నారు.లక్ష్మారెడ్డి ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి చైర్మన్గా కూడా సేవలందించారు. 1999, 2014లో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయాన్ని సాధించలేకపోయారు.ఆయన మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయ, పత్రికారంగాలకు పెద్ద లోటుగా భావించబడుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!