
న్యూస్

ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, పొగాకు సంబంధిత ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించగా, బీడీలపై 18 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు. అదనంగా పాన్ మసాలాపై ఆరోగ్య సెస్తో పాటు జాతీయ భద్రత సెస్ను కూడా విధించారు.
జీఎస్టీ, సెస్, అదనపు ఎక్సైజ్ పన్నుల కారణంగా ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్క సిగరెట్ ధర రూ.18 గా ఉండగా, ఫిబ్రవరి 1 నుంచి ఇది రూ.72 కు చేరనుంది. అలాగే పాన్ మసాలా ధరలు కూడా గణనీయంగా పెరిగే సూచనలు ఉండటంతో వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!