
జనరల్

మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దేశ దక్షిణ ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత విస్తరించేందుకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నెల రెండో వారంలో రాయలసీమ ప్రాంతంలోనూ రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో వచ్చే ఐదు రోజులపాటు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశముంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!