

స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ చేపట్టిన స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ (SOAR) కార్యక్రమంలో స్కిల్డినేషన్ ఛాలెంజ్ను రాష్ట్రపతి డ్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో జరిగింది. అదే సమయంలో ఒడిశాలోని రాయ్రంగ్పూర్లోని IGNOU రీజినల్ సెంటర్, స్కిల్ సెంటర్ను ఆమె వర్చువల్గా ప్రారంభించారు.
ఆ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము చెప్పారు: “AI ఆర్థిక వ్యవస్థలు, సమాజాలను ప్రపంచవ్యాప్తంగా మారుస్తోంది. నేర్చుకోవడం, పని చేయడం, ఆధునిక సేవలు పొందడం, మానవుల సమస్యలు పరిష్కరించడం – ఇవన్నీ AI ద్వారా మారుస్తుంది. భారత్ వంటి యువ దేశానికి AI కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అది అద్భుతమైన అవకాశంగా ఉంది.”
అంతేకాక, ముర్ము టెక్నాలజీ ప్రజలకు లబ్ధి చేకూర్చేలా, సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశం కల్పించేలా ఉండాలని, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల వారికి కూడా AI లాభాలు చేరేలా చూడాలి అని చెప్పారు. భవిష్యత్తులో ఎన్నో అవకాశాలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారని, ఇది చాలా సంతోషకరమైన పరిణామమని ఆమె పేర్కొన్నారు. అలాగే AI లెర్నింగ్ మోడ్యూల్స్ పూర్తి చేసిన ఎంపీలను ఆమె అభినందించారు.







.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!