
గాసిప్స్

మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేయనుంది. ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని సోమవారం ఈడీ పిలిచినా, ఆమె హాజరుకాలేదు. దీంతో త్వరలోనే మరోసారి సమన్లు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. న్యూయార్క్ మాన్హాటన్లో లగ్జరీ కండోమినియం కొనుగోలుకు సంబంధించిన డబ్బు లావాదేవీలపై ఈడీ విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
ఆర్థిక లావాదేవీల దారి తెలుసుకునే ఉద్దేశంతో టీనా అంబానీని ప్రశ్నించేందుకు ఈడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్కు సంబంధించిన బ్యాంకు మోసాలు, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఇటీవల ఈడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ కేసులలో భాగంగానే టీనా అంబానీని విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!