

అన్నీ సక్రమంగా జరిగి ఉంటె ఈ వారంలో టీం ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం జరగాల్సి ఉండేది. ఆమె ఫిల్మ్ మేకర్ మరియు సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో జీవితానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో, అనుకోని పరిణామాలు ఆ వివాహాన్ని నిలిపేశాయి.
స్మృతి తండ్రి అనారోగ్యం తో బాధపడటమే కాక, పలాష్ కూడా అస్వస్థతకు గురవడం వల్ల, ఈ వేడుక అర్థంతరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో, స్మృతి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఎంగేజ్మెంట్ మరియు పలాష్ ప్రపోజ్ చేసిన వీడియోలను తొలగించింది. పలాష్ కూడా కొన్ని పోస్టులను తొలగించినట్లు సమాచారం.
ఇలాంటి చర్యలకు కారణమేమిటి? పెళ్లి వాయిదా పడిందా? లేదా పూర్తిగా ఆగిపోయిందా? అభిమానుల ఆలోచనలు పెరుగుతున్న వేళ, పలాష్ పై చీట్ చేసాడంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఒక యువతి తన ఇన్స్టాగ్రామ్ లో పలాష్ చేసిన చాట్ స్క్రీన్ షాట్స్ను షేర్ చేసింది, అందరినీ షాక్లో ముంచిపెట్టింది.
స్మృతి ఈ పరిస్థితిని చూసి తన సోషల్ మీడియా ఖాతా నుంచి కొన్ని పోస్టులు, వీడియోలను తొలగించిందని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన వల్ల ఆమె తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చి ఉండవచ్చని ఊహలు కూడా వినిపిస్తున్నాయి.
పలాష్ చాట్స్ లో, స్మృతి ఎక్కువగా టూర్స్ లో ఉన్నందున అతను ఒంటరిగా ఉన్నాడని, గతంలో ఇద్దరూ కలసి టూర్స్కు వెళ్లేవారని, కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్ కారణంగా దూరం పెరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ చాట్స్ నిజంగానే పలాష్ చేసినవేనా? వీటి కారణంగానే పెళ్లి వాయిదా పడిందా? ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనలు స్మృతి లేదా పలాష్ కుటుంబాల నుండి వెలువడలేదు. కాగా, అస్వస్థతకు గురైన పలాష్ను ముంబై ఆస్పత్రికి తరలించారని అతని తల్లి తెలిపారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!