భద్రతా సిబ్బందికి డీజీపీ శివధర్రెడ్డి కీలక సూచనలు ఇచ్చారు. కోల్కతాలో జరిగిన ఘటనలను ఉదాహరణగా తీసుకొని, అవే తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కోల్కతా మెస్సీ టూర్కు సంబంధించిన గందరగోళాన్ని స్క్రీనింగ్ ద్వారా చూపిస్తూ, భద్రతలో ఎక్కడ లోపాలు చోటుచేసుకున్నాయో సిబ్బందికి వివరించారు.
స్టేడియంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. ప్రేక్షకుల రాకపోకలు సక్రమంగా ఉండేలా గేట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, గ్యాలరీలు, వీఐపీ జోన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో మూడు వేల మంది పోలీసులను మోహరించినట్లు తెలిపారు. అవసరమైతే అదనపు బలగాలను కూడా సిద్ధంగా ఉంచాలని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా శాంతిభద్రతలు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.




.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!