
న్యూస్

హైదరాబాద్లో జీఎస్టీ అధికారుల దాడుల్లో ఒక పెద్ద స్కాం బయటపడింది. డీజీజీఐ అధికారులు చేసిన తనిఖీల్లో సుమారు రూ.217 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 72 షెల్ కంపెనీలు ఈ స్కాంలో ఉన్నట్లు తెలిపారు. ఈ కంపెనీలు నకిలీ బిల్లులు తయారు చేసి అక్రమంగా లావాదేవీలు చేసినట్లు తెలిసింది.
దర్యాప్తులో భాగంగా సుమారు రూ.1,472 కోట్ల ఫేక్ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను దుర్వినియోగం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇంకా మరిన్ని వ్యక్తులు, సంస్థలు ఉన్నాయా అనే దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో జీఎస్టీ మోసాలపై మళ్లీ ఆందోళన పెరిగింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!