
గాసిప్స్

ఇండిగో ఎయిర్లైన్స్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠిన చర్యలు తీసుకుంది. ఇటీవల విమానాల సేవల్లో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఇండిగోపై రూ.22.2 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలగడం, సేవల నిర్వహణలో లోపాలు కనిపించడం ఇందుకు కారణమని డీజీసీఏ పేర్కొంది.
అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందులో భాగంగా రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారంటీని సమర్పించాలని ఇండిగోకు సూచించింది. విమానయాన భద్రత, ప్రయాణికుల సౌకర్యం అత్యంత ముఖ్యమని డీజీసీఏ స్పష్టం చేసింది.
ఇండిగో తమ సేవలను మెరుగుపర్చుకోవడంతో పాటు నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. ఈ నిర్ణయం దేశంలోని విమానయాన సంస్థలకు ఒక స్పష్టమైన హెచ్చరికగా భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!