

జొమాటో, బ్లింకిట్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ గిగ్ వర్క్ మోడల్పై మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇటీవల గిగ్ వర్కర్ల వేతనాలు, పని పరిస్థితులపై చర్చలు, నిరసనలు జరగడంతో దీనిపై ఆయన సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. గిగ్ వర్క్ అనేది ఫుల్టైమ్ ఉద్యోగానికి ప్రత్యామ్నాయం కాదని, అవసరమైనప్పుడు, కావలసిన గంటలే పని చేసే స్వేచ్ఛ ఉన్న మోడల్ అని వివరించారు.
డెలివరీ పార్ట్నర్ ఒకరు రోజుకు 10 గంటలు చొప్పున నెలలో 26 రోజులు పనిచేస్తే సుమారు రూ.26,500 వరకు సంపాదించవచ్చని తెలిపారు. పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులు తీసేసినా నెలకు దాదాపు రూ.21 వేల ఆదాయం మిగులుతుందని చెప్పారు. పైగా టిప్స్ అదనమని పేర్కొన్నారు. 2025లో డెలివరీ పార్ట్నర్లు సగటున ఏడాదికి కేవలం 38 రోజులు మాత్రమే పని చేశారని, అందులోనూ రోజుకు 7 గంటల చొప్పునేనని తెలిపారు. మొత్తం పార్ట్నర్లలో కేవలం 2.3 శాతం మంది మాత్రమే ఏడాదికి 250 రోజులకు పైగా పనిచేశారని వివరించారు.
10 నిమిషాల డెలివరీ వల్ల ప్రమాదాలు జరుగుతాయన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. బ్లింకిట్ డెలివరీ దూరం సగటున 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని, గంటకు సుమారు 16 కిలోమీటర్ల వేగంతోనే డెలివరీ జరుగుతుందని చెప్పారు. అలాగే 2025లో డెలివరీ పార్ట్నర్ల బీమా కోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. ఒక్కో పార్ట్నర్కు రూ.10 లక్షల ప్రమాద బీమా, మహిళా డెలివరీ ఏజెంట్లకు వేతనంతో కూడిన సెలవులు, ట్యాక్స్ ఫైలింగ్ సహాయం, పెన్షన్ సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ గిగ్ వర్క్ మోడల్పై అనవసర ఆందోళనలు వ్యక్తం చేయడం సరికాదని దీపిందర్ గోయల్ వ్యాఖ్యానించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!