
సినిమాలు

ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు అందుతున్నప్పటికీ కొందరిలో లంచాలపై ఆశ తగ్గడం లేదు. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించి సాధారణ పనులకే అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, విద్యుత్ తదితర ప్రజాసేవ శాఖల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
అవినీతి నిరోధక శాఖ గణాంకాల ప్రకారం గత కొన్ని సంవత్సరాల్లో వందలాది మంది అధికారులు, ఉద్యోగులు అవినీతి కేసుల్లో చిక్కుకున్నారు. గత నవంబర్కు ముందు ఐదేళ్ల కాలంలో 621 మంది అధికారులు, ఉద్యోగులు పట్టుబడ్డారు. ఇటీవల శామీర్పేట తహసీల్దార్ రూ.30 లక్షల లంచం వ్యవహారంలో రూ.2 లక్షల ముందస్తు మొత్తాన్ని తీసుకుంటూ పట్టుబడిన ఘటన చర్చనీయాంశమైంది. అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలతో పాటు విలువల ఆధారిత పరిపాలన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!