

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. గత సంవత్సరం ఆమె ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నడిపిన భారీ నిరసనలు హింసాత్మకంగా మారి, వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఆ అశాంతి సమయంలో షేక్ హసీనా దేశం విడిచి ఢిల్లీలో రాజకీయ ఆశ్రయం తీసుకున్నారు. పదవి నుండి తప్పిన తరువాత ఆమె బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లలేదు.
ఇప్పుడేమిటంటే బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రైబ్యునల్ ఆమె కేసులో తీర్పును వెలువరించింది. కోర్టు ఇచ్చిన నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంది. షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె భారత్లో ఉండటంతో, ఆమె గైర్హాజరీలోనే ఈ తీర్పు ప్రకటించారు.
2024 జూలై–ఆగస్టు మధ్య జరిగిన 36 రోజుల నిరసనల సమయంలో జరిగిన హింస, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఆమెను బాధ్యురాలిగా కోర్టు ప్రకటించింది. ఒక్క నివేదిక ప్రకారం ఆ కాలంలో దాదాపు 1,400 మంది మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ తీర్పు అమల్లోకి రావాలంటే ఆమె బంగ్లాదేశ్కు తిరిగి రావాలి. కానీ అది ఎప్పుడు జరుగుతుందో, జరుగుతుందో లేదో స్పష్టత లేదు.








.png&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!