
క్రీడలు

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూవేలానికి ఊహించని స్థాయిలో స్పందన లభించింది. హైదరాబాద్లోని రాయదుర్గంలో ఎకరా భూమి రూ.237 కోట్లకు అమ్ముడుపోవడం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనంగా మారింది.
రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 6 ఎకరాలు 9 గుంటల భూమికి ఈ వేలం నిర్వహించారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరా ధర రూ.177 కోట్లు పలకగా, ఈసారి మరింత పెరగడం గమనార్హం. హైదరాబాద్లో పెరుగుతున్న మౌలిక వసతులు, కమర్షియల్ డిమాండ్ కారణంగా భూముల విలువలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!