

హైదరాబాద్లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల వ్యవధిలో వందలాది మందిని మోసం చేసి సేకరించిన సొమ్మును ఒకే బ్యాంకు ఖాతాకు బదిలీ చేసిన ఘటనను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బయటపెట్టారు. కొండాపూర్కు చెందిన వ్యక్తి పేరుతో తెరవబడిన ఖాతాలో ఏకంగా రూ.296.96 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. 2022 అక్టోబరులో ప్రారంభమైన ఈ ఖాతా ద్వారా 2025 ఆగస్టు వరకు భారీగా డబ్బు మార్పిడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఖాతాపై వచ్చిన ఫిర్యాదులను విశ్లేషించగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాల ద్వారా డబ్బును బదిలీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా నమోదైన 38 కేసుల్లో సుమారు రూ.310 కోట్లకు పైగా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 17 మందిపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్డౌన్’ ద్వారా ఈ వివరాలు బయటపడ్డాయి. భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినప్పటికీ కొన్ని బ్యాంకులు గుర్తించకపోవడంపై పోలీసులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!