

అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత లేదు. ఈ పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ వేదికలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు చెందిన వందలాది చమురు నౌకలు అమెరికా వైపు వస్తున్నాయని తెలిపారు. తమ చమురును అమెరికా తీసుకునేలా ఇరాన్ నాయకత్వమే ఈ నౌకలను పంపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టెక్సాస్, లూసియానా, అలాస్కా ప్రాంతాలకు ఈ నౌకలు వెళ్లే అవకాశముందని చెప్పారు కానీ పూర్తి వివరాలు వెల్లడించలేదు.
ఈ ఉద్రిక్త పరిస్థితులపై ట్రంప్ కఠినంగా స్పందించారు. ఇరాన్ తో యుద్ధం జరిగితే అమెరికానే గెలుస్తుందని ఆయన అన్నారు. అదే సమయంలో కొన్ని అమెరికా వార్తా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అమెరికా సైనిక చర్యలు బాగా సాగుతున్నాయని, సైనికుల పనితీరు ప్రశంసనీయమని తెలిపారు.
ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ నౌకలపై ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ చెప్పారు. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ కు రోజుకు భారీ ఆర్థిక నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. పాకిస్థాన్ ద్వారా చర్చలకు ఇరాన్ ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలకు రాకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని మరోసారి స్పష్టం చేశారు.







.webp&w=3840&q=75)








.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!