

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో మరో కీలక అడుగు వేయబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ కాకినాడలో ప్రారంభం కానుంది. గత ఏడాది గ్రీన్కో గ్రూప్కు చెందిన ఏఎమ్ గ్రీన్ సంస్థకు ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏడాది లోపే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం విశేషం.
రూ.13 వేల కోట్ల పెట్టుబడితో 495 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు సీఎం అమరావతి నుంచి కాకినాడకు వెళ్లి, 11.20 గంటలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతపై ప్రసంగించనున్నారు.
పూర్తిగా పునరుత్పాదక శక్తిని ఉపయోగించి కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయనున్నారు. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే సాధారణ అమోనియాకు భిన్నంగా ఇది పర్యావరణానికి హానికరం కాదు. నాగార్జున ఫెర్టిలైజర్స్ పాత ప్లాంట్ను గ్రీన్ ప్లాంట్గా మార్చుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 2027 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!