
గాసిప్స్

అమరావతి: జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెల 27న ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెల రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించగా, ఆ గడువు నేటితో ముగుస్తోంది.
ప్రాథమిక నోటిఫికేషన్ తరువాత రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు అందాయి. వాటన్నింటినీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేందుకు సీఎం మంత్రులు, అధికారులతో చర్చిస్తున్నారు. అవసరమైన మార్పులు, చేర్పుల అనంతరం డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!