

దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పాల్గొననున్నారు. రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ సంస్థల ప్రతినిధులతో సమావేశమై కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు “ఏఐ యాక్సిలరేటర్స్ – ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనమిక్ గ్రోత్” సెషన్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి పాల్గొంటారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని పది లక్షల మంది యువతకు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాల శిక్షణ కోసం ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. యూనిసిస్తో క్వాంటమ్-ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఎన్ఐఈఎల్ఐటీతో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ, ఐఐటీ-మద్రాస్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటుకు ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు ప్రకటన చేయనున్నారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని, యూకే ప్రతినిధి బృందం మరియు అడోబ్, అరామ్కో, ఆటోడెస్క్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యాక అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!