
సినిమాలు

హైదరాబాద్లోని రాయదుర్గం ఐటీ కారిడార్లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయిని తాకాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన తాజా వేలంలో ఎకరం భూమి రూ.204 కోట్లకు అమ్ముడుపోయింది. నగరంలోని ప్రీమియం వాణిజ్య ప్రాంతాల్లో భూములపై పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతున్నట్లు ఈ వేలం స్పష్టం చేసింది.
రెండు రోజుల క్రితం నిర్వహించిన వేలంలో ఎకరానికి రికార్డు స్థాయిలో రూ.237 కోట్లు పలికిన నేపథ్యంలో, తాజాగా 5.09 ఎకరాల భూమిని వేలం వేసిన TGIIC రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకుంది. రెండు విడతల వేలాలను కలిపి సంస్థకు దాదాపు రూ.2,500 కోట్ల ఆదాయం లభించినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!