

అమెరికాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఎప్స్టీన్ ఫైల్స్ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్లో ప్రవేశాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఒక పౌరుడు లేఖ రాశారు. ఎప్స్టీన్తో గేట్స్ సంబంధాలపై వచ్చిన నివేదికలు ప్రజల్లో సందేహాలు కలిగిస్తున్నాయని, ఈ అంశంపై ప్రభుత్వం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లేఖలో ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన పత్రాల్లో బిల్ గేట్స్ పేరు అనేకసార్లు ప్రస్తావించబడినట్లు పేర్కొంటూ, ఈ అంశంపై పూర్తి స్థాయి పారదర్శకత అవసరమని అభిప్రాయపడ్డారు. భారతదేశం మానవ హక్కులు, నైతిక విలువలను కాపాడే దేశంగా ఉన్నందున, ఇటువంటి వివాదాలకు సంబంధించిన వ్యక్తుల ప్రవేశంపై సరైన పరిశీలన అవసరమని పేర్కొన్నారు.
అందువల్ల విదేశీయుల చట్టం మరియు వీసా నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అనుమతులు ఇవ్వాలని లేఖలో కోరారు. ఈ విషయంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!