.jpg&w=3840&q=75)
రాజకీయాలు

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులను కొనసాగించడంతో గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిను మూసివేసినట్లు ప్రకటించినట్టు సమాచారం. దీంతో అంతర్జాతీయ సరకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
మీడియా కథనాల ప్రకారం కాల్పుల విరమణ తర్వాత గ్రీస్, లైబీరియాకు చెందిన రెండు నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయి. కానీ పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారడంతో అనేక నౌకలు ప్రయాణాన్ని నిలిపివేశాయి. ఒక నౌక ముసందం తీరానికి చేరుకుని వెనక్కు మళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా చైనాకు చెందిన కాస్కోతో పాటు ఇతర నౌకలు పర్షియన్ గల్ఫ్లో వేచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి జలసంధిని దాటాయా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!