
సినిమాలు
.jpg.webp&w=3840&q=75)
దేశంలో కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం పెంచింది. సుమారు 70 శాతం వరకు గ్యాస్ సరఫరా పెరగడంతో పరిశ్రమలకు కొంత ఊరటన లభించింది. విదేశాల నుంచి గ్యాస్ నౌకలు వస్తుండటంతో ఇంధన కొరత కూడా కొంత తగ్గే అవకాశం ఉంది.
ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖ పంపించారు. గ్యాస్ సరఫరా పెరగడంతో పరిశ్రమలు ఎలాంటి అంతరాయం లేకుండా పని చేయగలవని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
స్టీల్, ఆటోమొబైల్, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్ వంటి పరిశ్రమలకు ముందుగా గ్యాస్ అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు లభించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.














.jpg.webp&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!