

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. కావ్య, శ్రావ్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా ఈ నెల 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ను చూస్తే ఇది యూత్ మరియు ఫ్యామిలీ ఆడియెన్స్కు నచ్చే ప్రేమ కథగా రూపొందించినట్టు తెలుస్తోంది. హీరో హర్ష్ రోషన్ తన మరదలైన హీరోయిన్ ప్రేమను గెలుచుకోవడానికి చేసే ప్రయత్నాలు, అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కొంటాడు అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ, సరదా సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్లో చూపించారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందన పొందాయి. తాజాగా విడుదలైన ట్రైలర్తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించారు. శివ ముప్పరాజు స్క్రీన్ప్లే మరియు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ‘బ్యాండ్ మేళం’ సినిమా ఈ నెల 26 న గ్రాండ్గా విడుదల కానుంది.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!