
సినిమాలు

జమ్మూకశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో పెద్ద విషాదం చోటుచేసుకుంది. అమ్మోనియం నైట్రేట్ పేలుడులో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, అందులో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు ఉన్నారని ప్రాథమిక వివరాలు చెబుతున్నాయి. పేలుడు ఎలా జరిగింది? ఏ సమయంలో జరిగింది? వంటి కీలక అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇటీవల ఇదే పోలీస్ స్టేషన్ నుంచి ఒక పెద్ద ఉగ్ర కుతంత్రాన్ని ఛేదించడం జరిగింది. అలాంటి నేపధ్యంలో ఈ అనూహ్య పేలుడు మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది.
అధికారులు పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!