

సైబర్ నేరాల నుండి ప్రజలను రక్షించడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఏవైనా మోసాలకు గురవుతున్న సంకేతాలు కనిపిస్తే వెంటనే వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల సమయంలో కస్టమర్లు హఠాత్తుగా డబ్బు విత్డ్రా చేయడం లేదా బంగారంపై రుణాలు తీసుకోవడం వంటి చర్యలను గమనించాలని చెప్పారు.
అటువంటి సందర్భాల్లో కస్టమర్ల ప్రవర్తనలో అసాధారణ మార్పులు కనిపిస్తే సైబర్ మోసం జరిగే అవకాశముందని భావించి వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, పెన్షనర్లను మోసగాళ్ల నుండి కాపాడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. అనుమానాస్పద లావాదేవీలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు, 1930 లేదా 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బ్యాంకర్లు, పోలీసులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే సైబర్ నేరాలను అరికట్టగలమని ఆయన తెలిపారు.

.jpeg&w=3840&q=75)






.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!