
న్యూస్

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హేట్ స్పీచ్ నివారణ బిల్లుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు మానవ హక్కులకు విరుద్ధమని, ప్రజాస్వామ్య స్వేచ్ఛను అణిచివేయడానికి ప్రయత్నమని ఆయన ఆరోపించారు. బిల్లులో అనేక అస్పష్ట అంశాలు ఉన్నాయని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కక్ష సాధింపుకు ఉపయోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ బిల్లు ఆధారాలు లేకుండా అరెస్టులకు దారి తీస్తుందని, నేరం రుజువు కాకముందే జైలుకు పంపేలా ఉందని ఆయన అన్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రమాదకర చట్టమని విమర్శించారు. బిల్లును అమలు చేసే ముందు హౌస్ కమిటీ ఏర్పాటు చేసి, విస్తృత చర్చలు జరిపి సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ బిల్లును పునర్విమర్శించాలని ఆయన కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!