
న్యూస్

గ్రూప్–3 పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు నేడు హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న మొత్తం 1,370 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అధికారిక అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల సీనియారిటీ ఆధారంగా శాఖల కేటాయింపును పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
గ్రూప్–3 పరీక్షను గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించగా, ఈ పరీక్షకు మొత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. అయితే వారిలో కేవలం 50.24 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. నియామక పత్రాల జారీతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్తగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!