
క్రీడలు

ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా వారిని లక్ష్యంగా చేసుకొని చంపేస్తామని ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరిక చేసింది. ప్రస్తుతం సుప్రీం లీడర్గా ఉన్న అలీ ఖమేనీ తర్వాత ఆ బాధ్యతలను ఆయన కుమారుడు ముజ్తబా హొస్సేనీ ఖమేనీకి అప్పగించే అవకాశమున్నట్లు వచ్చిన కథనాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఆ పదవిని చేపట్టే ఎవరైనా ఇజ్రాయెల్ లక్ష్యంగా మారుతారని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు, ఇరాక్ మరియు కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై వందల సంఖ్యలో డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై 40 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించినట్లు ఐఆర్జీసీ తెలిపింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటి వరకు ఇరాన్లో 1,097 మంది మృతి చెందినట్లు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!