

సౌదీ అరేబియాలో మరో భారతీయుడిని అదృష్టం వరించింది. అబుదాబిలో నిర్వహించే ప్రసిద్ధ ‘బిగ్ టికెట్’ లాటరీలో ఈసారి కేరళకు చెందిన పీవీ రాజన్ భారీ జాక్పాట్ కొట్టారు. సిరీస్ 281 లక్కీ డ్రాలో ఆయన రూ.61.37 కోట్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నారు.
రాజన్ నవంబర్ 9 న 282824 నంబర్ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. గత 15 సంవత్సరాలుగా ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఇంత పెద్ద మొత్తం గెలుచుకోవడం ఆయనకు ఇది మొదటిసారి. డ్రా కార్యక్రమం లాటరీ నిర్వాహకులు రిచార్డ్, బౌచ్రా సమక్షంలో జరిగిందీ. గత సిరీస్ విజేత అయిన భారతీయుడు శరవణన్ ఈసారి లక్కీ డ్రా తీశారు.
25 మిలియన్ దిర్హామ్స్ (రూ.61.37 కోట్లు) గెలుచుకున్న రాజన్ ఆనందానికి హద్దుల్లేవు. నిర్వాహకులు ఫోన్ ద్వారా విజయం గురించి తెలియజేయగా, ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయారు. గెలుచుకున్న ప్రైజ్ మనీని తనతో కలిసి పనిచేస్తున్న 15 మంది సహచరులతో పంచుకుంటానని రాజన్ తెలిపారు.
బిగ్ టికెట్ అబుదాబి సంస్థ ప్రతి నెలా ఈ లాటరీ డ్రాలను నిర్వహిస్తుంది. గ్రాండ్ ప్రైజ్తో పాటు కన్సోలేషన్ గిఫ్టులు కూడా ఇస్తుంది. ఈ నెలలో 10 మంది కన్సోలేషన్ విజేతలు ఎన్నుకోబడ్డారు. ఒక్కొక్కరు 10,000 దిర్హాములు (సుమారు రూ.2.45 లక్షలు) పొందగా, వారిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!