
గాసిప్స్

కోర్టు ఆదేశాలను పదే పదే ఉల్లంఘిస్తున్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలు, బోర్డులు ఏర్పాటు చేయడం, ఫెన్సింగ్ వేయడం తర్వాత న్యాయపరమైన లొసుగులు వెతకడం హైడ్రాకు అలవాటుగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది.
బాధితుడి భూమిలో ఏర్పాటు చేసిన బోర్డులు, ఫెన్సింగ్ను 24 గంటల్లో తొలగించాలని, కరెంట్ మరియు ఇతర కనెక్షన్లను పునరుద్ధరించేందుకు అయ్యే ఖర్చును హైడ్రానే భరించాలని హైకోర్టు ఆదేశించింది. స్టే ఆర్డర్లు ఉన్నా రాత్రివేళ భారీ బలగాలతో కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపణలు ఉండటాన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!