

శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ చిన్న అప్పన్నకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం సోమవారం తిరస్కరించింది.
శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంలో చిన్న అప్పన్న డెయిరీల నుంచి డబ్బులు స్వీకరించినట్లు ఆరోపణలు రావడంతో, సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేపట్టింది. దర్యాప్తు అనంతరం చిన్న అప్పన్నను సీబీఐ అరెస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిన్న అప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై టీటీడీ తరఫున, సీబీఐ తరఫున వాదనలు వినిపించగా, చిన్న అప్పన్న తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న అనంతరం, సీబీఐ మరియు టీటీడీ తరఫున చేసిన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం, చిన్న అప్పన్నకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.
.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!