
గాసిప్స్

డ్యూటీకి క్రమం తప్పకుండా హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అనుమతి లేకుండా ఏడాదికి మించి విధులకు దూరంగా ఉంటే నేరుగా ఉద్యోగం నుంచి తొలగించేలా తెలంగాణ సివిల్ సర్వీస్ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
వరుసగా సెలవుల్లో ఉండడం, అనుమతి లేకుండా సేవలో కొనసాగకపోవడం వంటి పరిస్థితుల్లో ఉద్యోగం తప్పదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదట సంబంధిత ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. ఆ తర్వాత సరైన వివరణ ఇవ్వకపోతే సేవల నుంచి తొలగించే చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ పరిపాలనలో క్రమశిక్షణ, బాధ్యత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!