
క్రీడలు

మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడుతో కనీసం 15 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో కర్మాగార భవనం పూర్తిగా ధ్వంసమైంది. పరిసర ప్రాంతాల్లోనూ ప్రభావం కనిపించింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల క్రింద ఇంకా కొంతమంది చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ఘటన పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!