

భారత స్వాతంత్ర సమరంలో కోట్లాది ప్రజలకు జాతి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మహనీయులను స్మరించుకుంటూ ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ సందేశాలను ఇచ్చి జాతీయోద్యమ వీరులకు నివాళులర్పించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “వందేమాతరం జాతీయ గీతం మనకు ఇచ్చిన స్ఫూర్తిని స్మరించుకుంటూ, సమైక్యతా భావంతో దేశాభివృద్ధికి పునరంకితమవుదాం” అని పిలుపునిచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయోద్యమ నాయకులను స్మరించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు చేరవేయడం మనందరి బాధ్యత” అన్నారు.
1875లో శ్రీ బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ గేయం, అప్పటి బ్రిటిష్ పాలనను సవాల్ చేసిన ధైర్య గానం. “వందేమాతరం” అనే నినాదం అప్పట్లో స్వాతంత్ర సమరయోధుల నోట మంత్రంలా మారింది. ఈ పదం వినగానే బ్రిటిష్ అధికారులు భయపడేవారని చరిత్ర చెబుతుంది.
ఈ రోజు కూడా వందేమాతరం ఆలపించినా ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాలలు రగులుతాయి. ఈ గీతం మన జాతి ఆత్మను ప్రతిబింబించే అద్భుతమైన స్ఫూర్తి గేయంగా నిలిచిపోయింది.
భారతమాత పట్ల మన కృతజ్ఞతను, గౌరవాన్ని వ్యక్తపరచే ఈ గీతం ప్రతి భారతీయుడి హృదయంలో సజీవంగా నిలిచి ఉంటుంది.
జైహింద్! వందేమాతరం!










కామెంట్స్ (2)
Proud moment for every Indian!
JAI HIND !!!!!