

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఒక ప్రధాన సమస్యపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక సినిమాను అవసరం లేకుండా మూడేళ్ల పాటు తెరకెక్కించడం ఇండస్ట్రీలోని పెద్ద సమస్యలలో ఒకటిగా మారిందన్నారు.
రాజమౌళి, సుకుమార్ వంటి స్టార్ దర్శకులు భారీ స్థాయి చిత్రాల కోసం ఎక్కువ సమయం తీసుకుంటే దానికి కారణం ఉంటుందని, కానీ కొందరు ఇతర దర్శకులు కూడా అనవసరంగా చిత్రాలను ఆలస్యం చేస్తున్నారని ధీరజ్ పేర్కొన్నారు. దీంతో హీరోలు ఒకే ప్రాజెక్ట్కు పరిమితమవుతున్నారని, అభిమానులు నిరాశ చెందుతున్నారని అన్నారు. ఒక సినిమాను 10 నెలల నుంచి ఏడాదిలోపు, అత్యధికంగా 14 నుంచి 15 నెలల్లో పూర్తి చేస్తే నిర్మాతలు సురక్షితంగా ఉంటారని, పరిశ్రమ కూడా ఆరోగ్యకరమైన దిశగా ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!