
షోస్

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల ఎట్టకేలకు నెరవేరింది. నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా అధికారికంగా ప్రకటించబడింది. నందమూరి బాలకృష్ణ తనయుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. దీంతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి అధికారికంగా రంగం సిద్ధమైనట్లయింది.
మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం చిత్ర బృందం ఈ ప్రకటన చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ తమ ఎక్స్ ఖాతాలో ‘కూన గుహను వీడింది. సింహంలా అడవిలోకి అడుగు పెట్టింది. హ్యాపీ బర్త్డే మోక్షజ్ఞ’ అంటూ ప్రత్యేకంగా పోస్ట్ చేసింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!