
సినిమాలు

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు లేఖ రాసింది. గత స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా భద్రతను మరింత పటిష్ఠం చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
వైసీపీ సమర్పించిన వినతిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సానుకూలంగా స్పందించారు. వైసీపీ వినతిపత్రాన్ని డీజీపీకి పంపించి తదుపరి చర్యల కోసం పరిశీలించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు, భద్రతా ఏర్పాట్లపై రాజకీయ పార్టీల నుంచి వినతులు వస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!